Skip to main content

ఆర్టీసీపై సాయంత్రం కేసీఆర్‌ కీలక సమీక్ష


ఆర్టీసీ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సాయంత్రం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమించి యథాతథంగా విధుల్లో చేరతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిన్న ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష కీలకంగా మారింది. ఈ సమీక్షకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఎండీ సునీల్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌ తదితరులు హాజరుకానున్నారు. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతంలో కార్మికులు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు సమ్మె విరమించలేదు. అయితే, ఐకాసనే స్వతహాగా ముందుకొచ్చి విధుల్లో చేరుతామని, షరతుల్లేకుండా కార్మికులను  చేర్చుకోవాలంటూ కోరిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పూర్తిస్థాయిలో సమీక్షించే అవకాశం ఉంది. ఐకాస ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు  కార్మికులను విధుల్లో చేర్చుకొనే అంశంపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, రూట్‌ పర్మిట్ల వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. అక్టోబర్‌ 5 నుంచి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...