Skip to main content

ఆర్టీసీపై సాయంత్రం కేసీఆర్‌ కీలక సమీక్ష


ఆర్టీసీ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సాయంత్రం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమించి యథాతథంగా విధుల్లో చేరతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిన్న ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష కీలకంగా మారింది. ఈ సమీక్షకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఎండీ సునీల్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌ తదితరులు హాజరుకానున్నారు. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతంలో కార్మికులు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు సమ్మె విరమించలేదు. అయితే, ఐకాసనే స్వతహాగా ముందుకొచ్చి విధుల్లో చేరుతామని, షరతుల్లేకుండా కార్మికులను  చేర్చుకోవాలంటూ కోరిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పూర్తిస్థాయిలో సమీక్షించే అవకాశం ఉంది. ఐకాస ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు  కార్మికులను విధుల్లో చేర్చుకొనే అంశంపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, రూట్‌ పర్మిట్ల వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. అక్టోబర్‌ 5 నుంచి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

  రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి...