Skip to main content

రాజధాని రైతులూ..తెదేపా మాయలో పడొద్దు’



 రాజధాని ప్రాంతంలో 57 శాతం నుంచి 90 శాతం వరకే కట్టిన నాలుగు భవనాలు తప్ప ఇంకేమీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రాజధానిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి జరిగిన పనులపై ఆరా తీశారని చెప్పారు. ఈనెల 28న అమరావతిలో పర్యటిస్తానంటున్న తెదేపా అధినేత చంద్రబాబు.. రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా అని ప్రశ్నించారు. 5 శాతం పనులే పూర్తి చేసి దాన్ని రాజధాని కట్టేయడం అంటారా? అని బొత్స నిలదీశారు. ఈ విషయంలో రైతులు చంద్రబాబును నిలదీయాలన్నారు.

అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు కౌలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు.  తెదేపా మాయలో రాజధాని రైతులు పడొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. అమరావతి పట్టణమా? గ్రామమా? అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా 14400 కాల్ సెంటర్ ప్రారంభించామని.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేయలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీన్ని మెచ్చుకుంటారో లేక తెదేపా కోరస్‌లా మాట్లాడతారో చూడాలని బొత్స వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...