Skip to main content

రాజధాని రైతులూ..తెదేపా మాయలో పడొద్దు’



 రాజధాని ప్రాంతంలో 57 శాతం నుంచి 90 శాతం వరకే కట్టిన నాలుగు భవనాలు తప్ప ఇంకేమీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రాజధానిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి జరిగిన పనులపై ఆరా తీశారని చెప్పారు. ఈనెల 28న అమరావతిలో పర్యటిస్తానంటున్న తెదేపా అధినేత చంద్రబాబు.. రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా అని ప్రశ్నించారు. 5 శాతం పనులే పూర్తి చేసి దాన్ని రాజధాని కట్టేయడం అంటారా? అని బొత్స నిలదీశారు. ఈ విషయంలో రైతులు చంద్రబాబును నిలదీయాలన్నారు.

అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు కౌలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు.  తెదేపా మాయలో రాజధాని రైతులు పడొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. అమరావతి పట్టణమా? గ్రామమా? అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా 14400 కాల్ సెంటర్ ప్రారంభించామని.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేయలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీన్ని మెచ్చుకుంటారో లేక తెదేపా కోరస్‌లా మాట్లాడతారో చూడాలని బొత్స వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.