మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారంటూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఒకవేళ గంటా బీజేపీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని మాధవ్ స్పష్టం చేశారు. ఇక, ఇంగ్లీషు మీడియం అంశంపైనా ఆయన మాట్లాడుతూ, మాతృభాషను నేర్చుకునే హక్కును నిర్మూలించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలకు దిగరాదని హితవు పలికారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment