Skip to main content

అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ ‘.. 50 : 50 పై ఒవైసీ సెటైర్


It looks like Uddhav Thackeray is afraid of Prime Minister Modi Owaisi said., ‘ అది మార్కెట్ లో కొత్త బిస్కెట్ ‘.. 50 : 50 పై ఒవైసీ సెటైర్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ-శివసేన మధ్య కొనసాగుతున్న సిగపట్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెరైటీగా స్పందించారు. ‘ 50 : 50 అన్నది మార్కెట్ లో కొత్త బిస్కెట్ లా ఉంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. (అధికారాన్ని చెరి సగం పంచుకునేందుకు శివసేన.. బీజేపీతో 50 : 50 షేరింగ్ ఫార్ములాను తెరపైకి తెచ్చిన సంగతి విదితమే. అయితే ఈ ఫార్ములా పట్ల బీజేపీ విముఖత చూపుతోంది.) తాము బీజేపీకి గానీ, శివసేనకు గానీ మద్దతు తెలుపబోమని ఒవైసీ స్పష్టం చేశారు. ‘ 50 : 50 అంటే ఏమిటి ? ఇది మార్కెట్లో లభించే కొత్త బిస్కెట్టా ? ముందు మహారాష్ట్ర ప్రజలకోసం ఏదో ఒకటి చేయండి.. సతారా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిల్చిన నష్టాల గురించి బీజేపీ గానీ, సేన గానీ పట్టించుకున్నాయా ? సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ‘ అంటే ఇదేనా ? ‘ అని ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం రెండు సీట్లను గెలుచుకుంది.
ఆ రాష్ట్రంలో ఫడ్నవీస్ గానీ, మరొకరు గానీ సీఎం అవుతారా కారా అన్న విషయం తనకు తెలియదని, అంతా ‘ మ్యూజికల్ చైర్స్ ‘ ఆట ఆడుతున్నారని ఒవైసీ పేర్కొన్నారు. అసలు ఏం చేయాలో శివసేనకు తోచడం లేదని, ప్రధాని మోదీ అంటే ఉధ్ధవ్ థాక్రే భయపడినట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.