Skip to main content

కమిటీ నివేదిక తర్వాతే రాజధానిపై పూర్తిస్థాయి నిర్ణయం: బొత్స




ఓవైపు కేంద్రం ప్రభుత్వం అధికారిక మ్యాప్ లో అమరావతికి చోటు కల్పించినా, సీఎం జగన్ అమరావతి నిర్మాణపనులపై సమీక్ష నిర్వహించినా ఏపీ రాజధానిపై ఇప్పటికీ అనిశ్చితి తొలగిపోలేదు. ఏపీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై పూర్తిస్థాయిలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, చంద్రబాబు అమరావతి పర్యటనపైనా విమర్శలు చేశారు.

రాజధానిలో ఏంచూడ్డానికి బాబు వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన లోటు వచ్చే 20 ఏళ్లలో కూడా తీర్చలేమని అన్నారు. వేల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఏం సంపద సృష్టించారని నిలదీశారు. రాజధానినే కాదు 2004కు ముందు  రాష్ట్రాన్నే బాబు శ్మశానం చేశారని మండిపడ్డారు. దేవాలయంలా భావిస్తే రాజధాని నిర్మాణం ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాజధాని పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని బొత్స స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.