Skip to main content

కమిటీ నివేదిక తర్వాతే రాజధానిపై పూర్తిస్థాయి నిర్ణయం: బొత్స




ఓవైపు కేంద్రం ప్రభుత్వం అధికారిక మ్యాప్ లో అమరావతికి చోటు కల్పించినా, సీఎం జగన్ అమరావతి నిర్మాణపనులపై సమీక్ష నిర్వహించినా ఏపీ రాజధానిపై ఇప్పటికీ అనిశ్చితి తొలగిపోలేదు. ఏపీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై పూర్తిస్థాయిలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, చంద్రబాబు అమరావతి పర్యటనపైనా విమర్శలు చేశారు.

రాజధానిలో ఏంచూడ్డానికి బాబు వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన లోటు వచ్చే 20 ఏళ్లలో కూడా తీర్చలేమని అన్నారు. వేల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఏం సంపద సృష్టించారని నిలదీశారు. రాజధానినే కాదు 2004కు ముందు  రాష్ట్రాన్నే బాబు శ్మశానం చేశారని మండిపడ్డారు. దేవాలయంలా భావిస్తే రాజధాని నిర్మాణం ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాజధాని పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని బొత్స స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...