Skip to main content

త్వరలో మూడో ప్రపంచ యుద్ధం.. కే ఏ పాల్ వీడియో.. ఆర్జీవీ ట్వీట్..

త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. 


త్వరలో మూడో ప్రపంచ యుద్ధం.. కే ఏ పాల్ వీడియో.. ఆర్జీవీ ట్వీట్..– News18 Telugu


త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. అందుకే తాను ప్రపంచ దేశాల అధ్యక్షులతో భేటీ అయ్యి.. శాంతి కోసం కృషి చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే ఏడుగురు దేశాధినేతలను కలిశానని వెల్లడించారు. అందుకే తాను పలు కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నానని, అందుకు క్షమించాలని అన్నారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేఖ కూడా రాయబోతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి, దండాలు అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా, ఆర్జీవీ కేఏ పాల్‌పై పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కామెడీగా చూపించారు. నా టార్గెడ్ మోడీ అంటూ.. తన ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలోని అందరూ ప్రధానులు అటెండ్ అవుతారని.. పాకిస్థాన్ యుద్దాన్ని తాను ఆపానని.. ఇలా పాటలో కేఏ పాల్ కొన్ని వ్యాఖ్యలి జోడిస్తూ.. చాలా సెటైరికల్‌గా రూపొందించారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.