Skip to main content

బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్.. రన్నరప్‌గా శ్రీముఖి


Bigg boss 3 title winner rahul sipligunj, బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్.. రన్నరప్‌గా శ్రీముఖి.?

ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకంకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి అవుతుందని అందరూ కూడా అనుకోగా.. ఊహించని విధంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే అనూహ్యంగా లక్ రాహుల్‌ని వరించింది. సీజన్ విన్నర్‌గా ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే.. రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఫైనల్ రేసులో రన్నరప్‌గా అవుతాడని అనుకున్న రాహుల్ టైటిల్ సొంతం చేసుకోగా.. శ్రీముఖి రెండు పర్సెంట్ ఓట్లు తేడాతో రన్నరప్‌గా నిలిచినట్లు సమాచారం.
ఇక వరుణ్ సందేశ్ మూడో స్థానంలో.. బాబా భాస్కర్ నాలుగో స్థానంలో.. అలీ రెజా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ట్రోఫీ, రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందుకోనున్నాడు.
మరోవైపు ఫినాలే ఎపిసోడ్‌కు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్, అంజలి, క్యాథరిన్‌ల హై వోల్టేజ్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఉండగా.. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...