Skip to main content

రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు



తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.  


ప్రభుత్వం తరఫున  అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించిన అనంతరం దానికి సంబంధించిన జీవో వచ్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఎవరూ సవాల్‌
చేయకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనిపేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తక్కువ ధరకే  ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకే ప్రైవేటీకరణ నిర్ణయమని ఏజీ వివరించారు. పిటిషనర్‌ తరఫున చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని, చట్టానికి అనుగుణంగా కేబినెట్‌ నిర్ణయం లేదని పేర్కొన్నారు. ‘‘ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 102 ప్రకారం  రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియ నిర్వహించే బాధ్యతను రాష్ట్ర రవాణా అథారిటీకి అప్పగిస్తున్నట్టు కేబినెట్‌  తీర్మానంలో ఉంది. రాష్ట్ర రవాణా అథారిటీ ఈ ప్రక్రియ ఎలా చేపడుతుంది’’ అని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా అథారిటీ అనే పదాన్ని హైకోర్టు తప్పు బట్టింది. రవాణా అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రైవేటీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మే స్వయంగా అమలు చేయాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రవాణా అథారిటీ బదులురాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని ఏజీ .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాంగ్మూలం ఇచ్చారు. ఏజీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనలో బలం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.