Skip to main content

రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు



తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.  


ప్రభుత్వం తరఫున  అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించిన అనంతరం దానికి సంబంధించిన జీవో వచ్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఎవరూ సవాల్‌
చేయకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనిపేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తక్కువ ధరకే  ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకే ప్రైవేటీకరణ నిర్ణయమని ఏజీ వివరించారు. పిటిషనర్‌ తరఫున చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని, చట్టానికి అనుగుణంగా కేబినెట్‌ నిర్ణయం లేదని పేర్కొన్నారు. ‘‘ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 102 ప్రకారం  రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియ నిర్వహించే బాధ్యతను రాష్ట్ర రవాణా అథారిటీకి అప్పగిస్తున్నట్టు కేబినెట్‌  తీర్మానంలో ఉంది. రాష్ట్ర రవాణా అథారిటీ ఈ ప్రక్రియ ఎలా చేపడుతుంది’’ అని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా అథారిటీ అనే పదాన్ని హైకోర్టు తప్పు బట్టింది. రవాణా అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రైవేటీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మే స్వయంగా అమలు చేయాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రవాణా అథారిటీ బదులురాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని ఏజీ .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాంగ్మూలం ఇచ్చారు. ఏజీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనలో బలం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...