Skip to main content

బిగ్ బాస్ విజేత శ్రీముఖి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

 
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్-3 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. టైటిల్ కోసం బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి పోటీపడుతున్నారు. మరోవైపు ఈ సీజన్ విజేత శ్రీముఖి అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విజేత అంటూ పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బిగ్ బాట్ టైటిల్ ను అందుకున్న శ్రీముఖిని... హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్టు ఉంది. ఇందులో ఎంత వరకు నిజం అనే దాంట్లో క్లారిటీ లేనప్పటికీ... ఈ పోస్ట్ కు జనాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అసలు విజేత ఎవరో తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.