Skip to main content

బిగ్ బాస్ విజేత శ్రీముఖి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

 
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్-3 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. టైటిల్ కోసం బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి పోటీపడుతున్నారు. మరోవైపు ఈ సీజన్ విజేత శ్రీముఖి అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విజేత అంటూ పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బిగ్ బాట్ టైటిల్ ను అందుకున్న శ్రీముఖిని... హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్టు ఉంది. ఇందులో ఎంత వరకు నిజం అనే దాంట్లో క్లారిటీ లేనప్పటికీ... ఈ పోస్ట్ కు జనాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అసలు విజేత ఎవరో తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...