Skip to main content

సమ్మెపై మాట్లాడదామంటే టీఆర్ఎస్ నేతల అపాయింట్ మెంట్ దొరకడం లేదు: పవన్ కల్యాణ్


 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాను మధ్యవర్తిత్వం నెరపి సమస్య పరిష్కారం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సమస్య పరిష్కారంకోసం తనను జోక్యం చేసుకోవాలని  ఆర్టీసీ కార్మికులు కోరారని పవన్ పేర్కొన్నారు. ఈరోజు పవన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు తదితరులు సమ్మెపై మాట్లాడేందుకు సుముఖంగా లేరని చెప్పారు.

సమ్మెపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు పీటముడిలా మారాయని, 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కార్మికులు తనతో చెప్పి బాధపడ్డారని తెలిపారు. తమ సమస్య తీరడానికి  జోక్యం చేసుకోవాలని కోరారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు, కొంతమంది మంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోసం జనసేన నేతలు ప్రయత్నించినప్పటికి ఫలితంలేకపోయిందన్నారు. వాళ్లను కలవడానికి మరోసారి ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారమయ్యేంతవరకు వారికి అండగా ఉంటానన్నారు. విశాఖలో ఈనెల 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ అనంతరం మళ్లీ టీఆర్ ఎస్ నేతలను కలవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...