Skip to main content

సమ్మెపై మాట్లాడదామంటే టీఆర్ఎస్ నేతల అపాయింట్ మెంట్ దొరకడం లేదు: పవన్ కల్యాణ్


 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తాను మధ్యవర్తిత్వం నెరపి సమస్య పరిష్కారం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సమస్య పరిష్కారంకోసం తనను జోక్యం చేసుకోవాలని  ఆర్టీసీ కార్మికులు కోరారని పవన్ పేర్కొన్నారు. ఈరోజు పవన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు తదితరులు సమ్మెపై మాట్లాడేందుకు సుముఖంగా లేరని చెప్పారు.

సమ్మెపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు పీటముడిలా మారాయని, 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కార్మికులు తనతో చెప్పి బాధపడ్డారని తెలిపారు. తమ సమస్య తీరడానికి  జోక్యం చేసుకోవాలని కోరారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు, కొంతమంది మంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోసం జనసేన నేతలు ప్రయత్నించినప్పటికి ఫలితంలేకపోయిందన్నారు. వాళ్లను కలవడానికి మరోసారి ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారమయ్యేంతవరకు వారికి అండగా ఉంటానన్నారు. విశాఖలో ఈనెల 3న తలపెట్టిన లాంగ్ మార్చ్ అనంతరం మళ్లీ టీఆర్ ఎస్ నేతలను కలవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...