Skip to main content

పొలిటికల్ జర్నీకి బ్రేక్.. ‘పింక్’ రీమేక్‌కు రెడీ

Pawan Kalyan re-entry confirms, పొలిటికల్ జర్నీకి బ్రేక్.. ‘పింక్’ రీమేక్‌కు రెడీ

పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సినిమాల్లోకి ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాదు దర్శకుడు, నిర్మాత కూడా ఖరారు అయ్యారు. మీరు చదువుతున్నది నిజంగా నిజం.
బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎమ్‌సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్కాగా హిందీలో ఘన విజయం సాధించిన పింక్‌ను తమిళ్‌లో ఇటీవల అజిత్ రీమేక్ చేశాడు. ‘నేర్కొండ పావై’ పేరుతో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీ రాబోతుంది.
అయితే పవన్ చివరగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఙ్ఞ్యాతవాసిలో కనిపించారు. ఆ తరువాత పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన ఆయా స్థానాల్లో ఓడిపోయారు. అయినప్పటికీ.. ప్రజల తరఫున సమస్యలపై ఆయన పోరాడుతున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారా..? లేక ఈ బ్రేక్ కొద్ది రోజులా..? అన్న ప్రశ్నలపై కాలమే సమాధానం చెప్పాలి.
ఇదిలా ఉంటే ఎమ్‌సీఏ తరువాత వేణు శ్రీరామ్, అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటించబోతున్నాడు.  ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఇంకాస్త సమయం పట్టనుండటంతో.. ఆ లోపు పవన్‌తో పింక్ రీమేక్‌ను చేయనున్నాడు వేణు శ్రీరామ్. ఏదేమైనా మొత్తానికి తమ అభిమాన నటుడు మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవ్వడంతో.. అభిమానులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆదర్శ్ అధికారికంగా ప్రకటించాడు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...