Skip to main content

చంద్రబాబు! నీ వల్ల హత్య గావించబడ్డ ఎన్టీ రామారావు కేసు ఎంక్వయిరీ చేద్దాం: శ్రీకాంత్ రెడ్డి



వైఎస్ వివేకా హత్య కేసు గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు తొందరపడుతున్నారని, అన్ని వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ‘చాలా పర్ఫెక్టుగా’ జరుగుతోందని, చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఆడిన నాటకాలు సహా అన్నీ బయటకొస్తాయని చెప్పారు. నీ వల్ల హత్య గావించబడ్డ ఎన్టీ రామారావు కేసును కూడా ఎంక్వయిరీ చేద్దాం. వాస్తవాలు బయటకొస్తాయి. ఎందుకు తొందరపడుతున్నావు? అన్నీ బయటకు తెచ్చి ప్రజలకు క్లిస్టర్ క్లియర్ గా తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబే ‘ఆంబోతు’ అని, తమ ఎమ్మెల్యేలు కాదని అన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...