Skip to main content

వేచి చూసే ధోరణిలో భాజపా మహారాష్ట్రలో మళ్లీ తమకే అవకాశం వస్తుందని ఆశలు..!

 వేచి చూసే ధోరణిలో భాజపా
 మహారాష్ట్రలో అధికార బంతి చివరకు ఎన్‌సీపీ కోర్టుకు చేరింది. గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి బంతిని సేన కోర్టులోకి నెట్టిన భాజపా తిరిగి అది తమ మైదానంలోకే వచ్చి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భాజపా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసంలో సోమవారం పార్టీ పలు దఫాల్లో చర్చలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతు కూడగట్టేందుకు శివసేన చేసిన ప్రయత్నాల్ని నిశితంగా గమనించింది. ఈ సమావేశాల అనంతరం భాజపా సీనియర్‌ నేత సుధీర్‌ మునగంటివార్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు వేచి చూడడమే మా పని’’ అని వ్యాఖ్యానించారు.
అయితే భాజపా పార్టీ వర్గాలు మాత్రం రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ సహా సేనలోని కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నించే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఓ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మాట్లాడుతూ..‘‘శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించదని మా పార్టీ(భాజపా) బలంగా విశ్వసిస్తోంది. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన అనివార్యం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సంవత్సరానికి మించి నిలబడదు’’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ కోర్‌ కమిటీలోని ఓ సీనియర్‌ నేత ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎట్టిపరిస్థితుల్లో ఇక శివసేనతో కలిసేది లేదని’ అన్నారు. ‘‘శివసేనతో కలిసి నడిచే ప్రసక్తే లేదు. అయితే ఆ పార్టీలోని 25 ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. శివసేన వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీలో కొంతమంది అంసతృప్తిగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి అన్ని విషయాలు ఓ కొలిక్కి వస్తాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తిరిగి తమకే రావొచ్చని భాజపా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తం చేయాలని ఆ పార్టీకి గడువు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...