Skip to main content

వేచి చూసే ధోరణిలో భాజపా మహారాష్ట్రలో మళ్లీ తమకే అవకాశం వస్తుందని ఆశలు..!

 వేచి చూసే ధోరణిలో భాజపా
 మహారాష్ట్రలో అధికార బంతి చివరకు ఎన్‌సీపీ కోర్టుకు చేరింది. గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి బంతిని సేన కోర్టులోకి నెట్టిన భాజపా తిరిగి అది తమ మైదానంలోకే వచ్చి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భాజపా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసంలో సోమవారం పార్టీ పలు దఫాల్లో చర్చలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతు కూడగట్టేందుకు శివసేన చేసిన ప్రయత్నాల్ని నిశితంగా గమనించింది. ఈ సమావేశాల అనంతరం భాజపా సీనియర్‌ నేత సుధీర్‌ మునగంటివార్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు వేచి చూడడమే మా పని’’ అని వ్యాఖ్యానించారు.
అయితే భాజపా పార్టీ వర్గాలు మాత్రం రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ సహా సేనలోని కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నించే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఓ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మాట్లాడుతూ..‘‘శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించదని మా పార్టీ(భాజపా) బలంగా విశ్వసిస్తోంది. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన అనివార్యం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సంవత్సరానికి మించి నిలబడదు’’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ కోర్‌ కమిటీలోని ఓ సీనియర్‌ నేత ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎట్టిపరిస్థితుల్లో ఇక శివసేనతో కలిసేది లేదని’ అన్నారు. ‘‘శివసేనతో కలిసి నడిచే ప్రసక్తే లేదు. అయితే ఆ పార్టీలోని 25 ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. శివసేన వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీలో కొంతమంది అంసతృప్తిగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి అన్ని విషయాలు ఓ కొలిక్కి వస్తాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తిరిగి తమకే రావొచ్చని భాజపా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తం చేయాలని ఆ పార్టీకి గడువు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...