Skip to main content

వేచి చూసే ధోరణిలో భాజపా మహారాష్ట్రలో మళ్లీ తమకే అవకాశం వస్తుందని ఆశలు..!

 వేచి చూసే ధోరణిలో భాజపా
 మహారాష్ట్రలో అధికార బంతి చివరకు ఎన్‌సీపీ కోర్టుకు చేరింది. గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి బంతిని సేన కోర్టులోకి నెట్టిన భాజపా తిరిగి అది తమ మైదానంలోకే వచ్చి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భాజపా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసంలో సోమవారం పార్టీ పలు దఫాల్లో చర్చలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతు కూడగట్టేందుకు శివసేన చేసిన ప్రయత్నాల్ని నిశితంగా గమనించింది. ఈ సమావేశాల అనంతరం భాజపా సీనియర్‌ నేత సుధీర్‌ మునగంటివార్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు వేచి చూడడమే మా పని’’ అని వ్యాఖ్యానించారు.
అయితే భాజపా పార్టీ వర్గాలు మాత్రం రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ సహా సేనలోని కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నించే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఓ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మాట్లాడుతూ..‘‘శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించదని మా పార్టీ(భాజపా) బలంగా విశ్వసిస్తోంది. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన అనివార్యం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సంవత్సరానికి మించి నిలబడదు’’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ కోర్‌ కమిటీలోని ఓ సీనియర్‌ నేత ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎట్టిపరిస్థితుల్లో ఇక శివసేనతో కలిసేది లేదని’ అన్నారు. ‘‘శివసేనతో కలిసి నడిచే ప్రసక్తే లేదు. అయితే ఆ పార్టీలోని 25 ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. శివసేన వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీలో కొంతమంది అంసతృప్తిగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి అన్ని విషయాలు ఓ కొలిక్కి వస్తాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తిరిగి తమకే రావొచ్చని భాజపా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తం చేయాలని ఆ పార్టీకి గడువు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...