Skip to main content

వేచి చూసే ధోరణిలో భాజపా మహారాష్ట్రలో మళ్లీ తమకే అవకాశం వస్తుందని ఆశలు..!

 వేచి చూసే ధోరణిలో భాజపా
 మహారాష్ట్రలో అధికార బంతి చివరకు ఎన్‌సీపీ కోర్టుకు చేరింది. గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి బంతిని సేన కోర్టులోకి నెట్టిన భాజపా తిరిగి అది తమ మైదానంలోకే వచ్చి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భాజపా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసంలో సోమవారం పార్టీ పలు దఫాల్లో చర్చలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతు కూడగట్టేందుకు శివసేన చేసిన ప్రయత్నాల్ని నిశితంగా గమనించింది. ఈ సమావేశాల అనంతరం భాజపా సీనియర్‌ నేత సుధీర్‌ మునగంటివార్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు వేచి చూడడమే మా పని’’ అని వ్యాఖ్యానించారు.
అయితే భాజపా పార్టీ వర్గాలు మాత్రం రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ సహా సేనలోని కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నించే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఓ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మాట్లాడుతూ..‘‘శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించదని మా పార్టీ(భాజపా) బలంగా విశ్వసిస్తోంది. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన అనివార్యం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సంవత్సరానికి మించి నిలబడదు’’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ కోర్‌ కమిటీలోని ఓ సీనియర్‌ నేత ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎట్టిపరిస్థితుల్లో ఇక శివసేనతో కలిసేది లేదని’ అన్నారు. ‘‘శివసేనతో కలిసి నడిచే ప్రసక్తే లేదు. అయితే ఆ పార్టీలోని 25 ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. శివసేన వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీలో కొంతమంది అంసతృప్తిగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి అన్ని విషయాలు ఓ కొలిక్కి వస్తాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తిరిగి తమకే రావొచ్చని భాజపా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తం చేయాలని ఆ పార్టీకి గడువు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.