Skip to main content

నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం జగన్ తో చర్చించా: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు



బీజేపీ నేతలతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు టచ్ లో ఉంటున్నారని వార్తలు రావటంతో గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీతో పాటు, అన్ని పార్టీల నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రధాని మోదీ తనను గుర్తుపట్టి పలకరించారని, దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోరాదని సూచించారు. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సుజనా చౌదరి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన్నే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.

ఈ రోజు రఘురామకృష్ణంరాజు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడం జరిగింది. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ఆర్ అండ్ బీ ముఖ్యకార్శదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి సీఎం వద్దకు వెళ్లానని చెప్పారు.

వశిష్ఠ వారధి ప్రారంభోత్సవం పెండింగ్ లో ఉందని.. దీనిపై సీఎంతో చర్చించాలని కలిశానన్నారు. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా తెలుగు అభివృద్ధిపై వివరించానని సీఎంకు తెలిపానన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో నియోజకవర్గ అభివృద్ధిపై జగన్ తో చర్చలు చేశానని తెలిపారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...