Skip to main content

నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం జగన్ తో చర్చించా: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు



బీజేపీ నేతలతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు టచ్ లో ఉంటున్నారని వార్తలు రావటంతో గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీతో పాటు, అన్ని పార్టీల నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రధాని మోదీ తనను గుర్తుపట్టి పలకరించారని, దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోరాదని సూచించారు. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సుజనా చౌదరి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన్నే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.

ఈ రోజు రఘురామకృష్ణంరాజు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడం జరిగింది. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ఆర్ అండ్ బీ ముఖ్యకార్శదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి సీఎం వద్దకు వెళ్లానని చెప్పారు.

వశిష్ఠ వారధి ప్రారంభోత్సవం పెండింగ్ లో ఉందని.. దీనిపై సీఎంతో చర్చించాలని కలిశానన్నారు. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా తెలుగు అభివృద్ధిపై వివరించానని సీఎంకు తెలిపానన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో నియోజకవర్గ అభివృద్ధిపై జగన్ తో చర్చలు చేశానని తెలిపారు.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.