మహారాష్ట్రలో ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని, ఈ దిశగా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ ఉదయం సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. శివసేన - ఎన్సీపీల మధ్య ఓ డీల్ కుదిరితే, ఆపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని, ముందు ఆ రెండు పార్టీలూ ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, శివసేన - ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధమని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో ఈ సాయంత్రం నుంచి మూడు పార్టీల మధ్యా తుది చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment