Skip to main content

అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..! మంత్రులకు యూపీ సీఎం యోగి వార్నింగ్‌


‘అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..!
కొన్ని రోజుల్లో అయోధ్య కేసు తుది తీర్పువెలువడనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరాదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ తన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తీర్పు వచ్చే వరకు నోర్లకు పనిచెప్పకండని కాస్తగట్టిగానే హెచ్చరించారని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు.
‘అధికార ప్రభుత్వానికి అనూకూలంగా సుప్రీం తీర్పు వస్తుందని అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకండని మా ముఖ్యమంత్రి యోగిజీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంత్రులందరూ వ్యక్తిగతంగా దిక్కత్‌ జారీ చేశారు. ఈ విషయంలో భాజపా అధిష్ఠానం కూడా హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా..అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలు చేసుకోకూడదనే నిబంధన విధించారు. హిందూ, ముస్లిం వర్గాలకు ప్రభుత్వం తరఫున మా విన్నపం ఇదే. వేడుకలు చేసుకొని మరొకరి మనోభావాలు దెబ్బతీయకండి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ దీనిపై సమావేశాలు కూడా నిర్వహించింది. భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించింది. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...