Skip to main content

అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..! మంత్రులకు యూపీ సీఎం యోగి వార్నింగ్‌


‘అయోధ్య’పై వివాదాస్పదంగా మాట్లాడారో..!
కొన్ని రోజుల్లో అయోధ్య కేసు తుది తీర్పువెలువడనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరాదంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ తన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తీర్పు వచ్చే వరకు నోర్లకు పనిచెప్పకండని కాస్తగట్టిగానే హెచ్చరించారని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు.
‘అధికార ప్రభుత్వానికి అనూకూలంగా సుప్రీం తీర్పు వస్తుందని అర్థం వచ్చేలా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకండని మా ముఖ్యమంత్రి యోగిజీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంత్రులందరూ వ్యక్తిగతంగా దిక్కత్‌ జారీ చేశారు. ఈ విషయంలో భాజపా అధిష్ఠానం కూడా హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా..అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి అనుకూలంగా వచ్చినా వేడుకలు చేసుకోకూడదనే నిబంధన విధించారు. హిందూ, ముస్లిం వర్గాలకు ప్రభుత్వం తరఫున మా విన్నపం ఇదే. వేడుకలు చేసుకొని మరొకరి మనోభావాలు దెబ్బతీయకండి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ దీనిపై సమావేశాలు కూడా నిర్వహించింది. భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించింది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.