Skip to main content

చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌

చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌
 కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ..  ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతల తీరుపై పవన్‌ నిప్పులు చెరిగారు.
అద్భుత పాలన అందిస్తే నేను.. సినిమాలు చేసుకుంటా
‘‘అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నాయకులంతా బాధ్యతగా ఉండుంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది. సీఎం జగన్‌ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఇసుక కొరత వల్లే అభివృద్ధి ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాకింది. ఆ కార్మికుల కష్టాల్లో నాకు దేవుడు కనిపించాడు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ఆలోచించాలి’’ అని పవన్‌ అన్నారు.
చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌
కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చిందే మేము!
‘‘నన్ను విమర్శిస్తున్న నాయకుల బతుకులు తెలుసు. కన్నబాబును నాగబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన నన్ను విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని అలుసా? ఓటమి, గెలుపు కాదు.. పోరాటమే మాకు తెలుసు. నన్ను విమర్శించే నాయకుల్లా నాకు వేల ఎకరాలు లేవు. వైకాపా నేతల్లా రాజకీయాల్లో రూ.వందలకోట్లు ఖర్చు పెట్టలేను. నన్ను విమర్శించే నాయకులంతా ఓ పార్టీ పెట్టి చూడండి. పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. నేను డబ్బుతో పార్టీ నడిపే వ్యక్తిని కాదు..భావజాలంతో నడుపుతున్నా’’ అని చెప్పారు. 
రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు
‘‘భవన నిర్మాణ కార్మికుల విషయంలో వైకాపా ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం చేసిన తప్పునకు ఉపాధి కోల్పోయి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఒక్కో కార్మికుడికి రూ.50వేల సాయం ఇవ్వాలి. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేయాలి. రెండు వారాల్లో ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. చంద్రబాబుపై కోపం కార్మికులపై చూపొద్దు. పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైనా నిర్మాణాలతో పాలన మొదలెడతారు.. వీళ్లు మాత్రం కూల్చివేతలతో మొదలెట్టారు. ఎంతవేగంగా నిర్మాణాలను కూల్చివేశారో ప్రభుత్వం కూడా అంతేవేగంగా పడిపోతుంది’’ అని పవన్‌ దుయ్యబట్టారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...