Skip to main content

చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌

చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌
 కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ..  ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతల తీరుపై పవన్‌ నిప్పులు చెరిగారు.
అద్భుత పాలన అందిస్తే నేను.. సినిమాలు చేసుకుంటా
‘‘అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమో.. నాకు మాత్రం బాధ్యత. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నాయకులంతా బాధ్యతగా ఉండుంటే జనసేన పెట్టే అవసరమే లేకపోయేది. సీఎం జగన్‌ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఇసుక కొరత వల్లే అభివృద్ధి ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా నా మనసును తాకింది. ఆ కార్మికుల కష్టాల్లో నాకు దేవుడు కనిపించాడు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారో ఆలోచించాలి’’ అని పవన్‌ అన్నారు.
చంద్రబాబుకుకాదు ప్రజలకు దత్తపుత్రుడిని:పవన్‌
కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చిందే మేము!
‘‘నన్ను విమర్శిస్తున్న నాయకుల బతుకులు తెలుసు. కన్నబాబును నాగబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన నన్ను విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని అలుసా? ఓటమి, గెలుపు కాదు.. పోరాటమే మాకు తెలుసు. నన్ను విమర్శించే నాయకుల్లా నాకు వేల ఎకరాలు లేవు. వైకాపా నేతల్లా రాజకీయాల్లో రూ.వందలకోట్లు ఖర్చు పెట్టలేను. నన్ను విమర్శించే నాయకులంతా ఓ పార్టీ పెట్టి చూడండి. పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. నేను డబ్బుతో పార్టీ నడిపే వ్యక్తిని కాదు..భావజాలంతో నడుపుతున్నా’’ అని చెప్పారు. 
రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు
‘‘భవన నిర్మాణ కార్మికుల విషయంలో వైకాపా ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం చేసిన తప్పునకు ఉపాధి కోల్పోయి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఒక్కో కార్మికుడికి రూ.50వేల సాయం ఇవ్వాలి. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేయాలి. రెండు వారాల్లో ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. చంద్రబాబుపై కోపం కార్మికులపై చూపొద్దు. పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైనా నిర్మాణాలతో పాలన మొదలెడతారు.. వీళ్లు మాత్రం కూల్చివేతలతో మొదలెట్టారు. ఎంతవేగంగా నిర్మాణాలను కూల్చివేశారో ప్రభుత్వం కూడా అంతేవేగంగా పడిపోతుంది’’ అని పవన్‌ దుయ్యబట్టారు.  

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.