Skip to main content

దెయ్యం ప్రాంక్‌ వీడియోలు.. యువకుల అరెస్టు!

 
దెయ్యం ప్రాంక్‌ వీడియోలు.. యువకుల అరెస్టు!
బెంగళూరు: యూట్యూబ్‌ ప్రాంక్‌ వీడియోల పేరుతో దెయ్యం వేషాధారణలో స్థానికులను భయపెడుతున్న కొందరు యువకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని యశ్వంత్‌పుర సమీపంలోని షరీఫ్‌నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు యూట్యూబ్‌ ప్రాంక్‌ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఈక్రమంలో వారు దెయ్యం వేషాధారణలో (పెద్ద గోళ్లు, తెల్ల గౌన్లు, రక్తపు మరకలతో) ప్రజలను భయపెట్టి వారి హావభావాలను వీడియోలు తీస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు ఆటోలో వెళ్లే ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై కొందరు స్థానికులు వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిలో ఏడుగురిని గుర్తించి అరెస్టు చేశారు. ఒకరి మొబైల్‌లో పలు ప్రాంక్ వీడియోలు సైతం గుర్తించారు. అరెస్టయిన వారిలో 18 నుంచి 25 మధ్య వయసున్న యువకులే ఉన్నారు. వారు ప్రాంక్‌ వీడియోలే చేయాలనుకున్నారు.. కానీ చేసిన విధానం చాలా ప్రమాదకరంగా ఉందని బెంగళూరు నార్త్‌ డీసీపీ శశికుమార్‌ అన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...