Skip to main content

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ఖాయమేనట



ఇటీవల సురేందర్ రెడ్డి నుంచి వచ్చిన 'సైరా' తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చారిత్రక నేపథ్యం కలిగిన భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి సమర్థవంతంగా తెరకెక్కించాడంటూ ప్రశంసలు దక్కాయి. అలాంటి సురేందర్ రెడ్డి ఇక తనదైన స్టైల్లో ఒక కథను సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇదే నేపథ్యంలో ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ దిశగా దిల్ రాజు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్లో ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. ప్రభాస్ హీరోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగా .. సురేందర్ రెడ్డి మార్క్ స్టైలీష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.  

Comments

Popular posts from this blog

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

  రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి...