Skip to main content

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ఖాయమేనట



ఇటీవల సురేందర్ రెడ్డి నుంచి వచ్చిన 'సైరా' తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చారిత్రక నేపథ్యం కలిగిన భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి సమర్థవంతంగా తెరకెక్కించాడంటూ ప్రశంసలు దక్కాయి. అలాంటి సురేందర్ రెడ్డి ఇక తనదైన స్టైల్లో ఒక కథను సిద్ధం చేసుకుని ప్రభాస్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇదే నేపథ్యంలో ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ దిశగా దిల్ రాజు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఈ ముగ్గురి కాంబినేషన్లో ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. ప్రభాస్ హీరోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్ కి తగినట్టుగా .. సురేందర్ రెడ్డి మార్క్ స్టైలీష్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.  

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.