Skip to main content

‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!


‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. హస్తం పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే దిల్లీలో స్పందించారు. ‘‘మహారాష్ట్ర రాజకీయాల వ్యవహారంపై  మా పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, మహారాష్ట్ర పీసీసీ సభ్యులతో మాట్లాడినట్టు ఇప్పటికే మీడియాకు ప్రకటన విడుదల చేశాం. మా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌తో ఇప్పటికే మాట్లాడారు. తదుపరి చర్చలు ముంబయిలో మంగళవారం జరుగుతాయి’’ అని ఖర్గే స్పష్టంచేశారు. సోమవారం ఉదయం దిల్లీలోని 10 జన్‌పథ్‌లో  రెండు పర్యాయాలు భేటీ అయిన కాంగ్రెస్‌ కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతోనూ సోనియా మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన లేఖలను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు రాజ్‌భవన్‌కు పంపినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇంకా శివసేనకు అలాంటి లేఖలేమీ పంపలేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.  
‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!
ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సోనియా
ఈ రోజు ఉదయం దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీలోనే శివసేనతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో చేరాలా? లేదంటే బయటి నుంచే మద్దతు ఇవ్వాలా? అనే అంశంపై సోనియా గాంధీ నేతృత్వంలో నేతలు కీలక మంతనాలు చేశారు. ఇదే విషయంపై జైపూర్‌లోని రిసార్ట్స్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతోనూ సోనియా గాంధీ మాట్లాడారు. వారంతా ఇందుకు అంగీకరించినట్టు సమాచారం. 

‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!
మహా రాజకీయాల్లో ఎన్ని మలుపులో..!

మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్‌ 21న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి ‘మహాయుతి’ కూటమిగా ప్రజల్లోకి వెళ్లాయి. అలాగే, కాంగ్రెస్‌ - ఎన్సీపీ కూడా కూటమిగానే బరిలోకి దిగాయి. అక్టోబర్‌ 24న వెల్లడైన ఫలితాల్లో భాజపా 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను (145 స్థానాలు) ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. భాజపా, శివసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం ఇరు పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరాఠా రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. సీఎం పదవీ కాలం చెరిసగం పంచుకోవడంపై తలెత్తిన వివాదంపై దాదాపు మూడు వారాలుగా ఈ రెండు కాషాయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోగా.. నేతల మధ్య మాటామాటా పెరగడంతో మరింత దూరం పెరిగింది. ఆరెస్సెస్‌ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.  దీంతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోయింది. గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు ఇదే విషయాన్ని స్పష్టంచేయడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించారు. దీంతో సైద్ధాంతికంగా సారూప్యత లేకపోయినప్పటికీ శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతును కోరింది. ఎన్సీపీ మద్దతుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ‘మహా’ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. 

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.