Skip to main content

‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!


‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. హస్తం పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే దిల్లీలో స్పందించారు. ‘‘మహారాష్ట్ర రాజకీయాల వ్యవహారంపై  మా పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, మహారాష్ట్ర పీసీసీ సభ్యులతో మాట్లాడినట్టు ఇప్పటికే మీడియాకు ప్రకటన విడుదల చేశాం. మా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌తో ఇప్పటికే మాట్లాడారు. తదుపరి చర్చలు ముంబయిలో మంగళవారం జరుగుతాయి’’ అని ఖర్గే స్పష్టంచేశారు. సోమవారం ఉదయం దిల్లీలోని 10 జన్‌పథ్‌లో  రెండు పర్యాయాలు భేటీ అయిన కాంగ్రెస్‌ కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతోనూ సోనియా మాట్లాడినట్టు సమాచారం. ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన లేఖలను ఎన్సీపీ, కాంగ్రెస్‌లు రాజ్‌భవన్‌కు పంపినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇంకా శివసేనకు అలాంటి లేఖలేమీ పంపలేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.  
‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!
ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సోనియా
ఈ రోజు ఉదయం దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీలోనే శివసేనతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో చేరాలా? లేదంటే బయటి నుంచే మద్దతు ఇవ్వాలా? అనే అంశంపై సోనియా గాంధీ నేతృత్వంలో నేతలు కీలక మంతనాలు చేశారు. ఇదే విషయంపై జైపూర్‌లోని రిసార్ట్స్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతోనూ సోనియా గాంధీ మాట్లాడారు. వారంతా ఇందుకు అంగీకరించినట్టు సమాచారం. 

‘మహా’ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌!
మహా రాజకీయాల్లో ఎన్ని మలుపులో..!

మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్‌ 21న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి ‘మహాయుతి’ కూటమిగా ప్రజల్లోకి వెళ్లాయి. అలాగే, కాంగ్రెస్‌ - ఎన్సీపీ కూడా కూటమిగానే బరిలోకి దిగాయి. అక్టోబర్‌ 24న వెల్లడైన ఫలితాల్లో భాజపా 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను (145 స్థానాలు) ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. భాజపా, శివసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం ఇరు పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరాఠా రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. సీఎం పదవీ కాలం చెరిసగం పంచుకోవడంపై తలెత్తిన వివాదంపై దాదాపు మూడు వారాలుగా ఈ రెండు కాషాయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోగా.. నేతల మధ్య మాటామాటా పెరగడంతో మరింత దూరం పెరిగింది. ఆరెస్సెస్‌ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.  దీంతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోయింది. గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు ఇదే విషయాన్ని స్పష్టంచేయడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించారు. దీంతో సైద్ధాంతికంగా సారూప్యత లేకపోయినప్పటికీ శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతును కోరింది. ఎన్సీపీ మద్దతుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ‘మహా’ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...