Skip to main content

మాతృభాషను ఎలా కాపాడుకోవాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి: వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హితవు


ఏపీలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న వైసీపీ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందని నిలదీశారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ వైసీపీ సర్కారుకు హితవు పలికారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ పరిరక్షించుకుంటున్న వైనం వైసీపీ నాయకత్వానికి ఓ పాఠం వంటిదని తెలిపారు. మాతృభాష మనుగడ కోసం 2017 తెలుగు మహాసభల్లో 'తొలి పొద్దు' పేరుతో 442 మంది కవులు రాసిన రచనలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...