టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు
మిథున్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజులు లోక్సభ జనరల్ పర్పస్ కమిటీ
సభ్యులుగా నియమితులయ్యారు. లోక్సభ స్పీకర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ
కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్రాం మేఘవాల్,
వి.మురళీధరన్లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ నామా,
వైసీపీ ఎంపీలను కమిటీ సభ్యులుగా నియమించినట్టు శనివారం లోక్సభ సచివాలయం
బులెటిన్ విడుదల చేసింది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment