Skip to main content

రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

Anil Sunkara gives assurance to Mahesh Babu fans, రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

మహేష్ ఫ్యాన్స్‌కు నిర్మాత భరోసా ఇచ్చేశాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఆయన ఊరించాడు. ఇక ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అసలు ఆ నిర్మాత ఏం చెప్పాడు..? మహేష్ ఫ్యాన్స్‌కు ఏ ట్రీట్ ఇవ్వబోతున్నాడు..? అనుకుంటున్నారా..?
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం పై వస్తోన్న వార్తలు మహేష్ అభిమానులను కాస్త కలవరపాటుకు గురిచేశాయి. ఈ సినిమా పాటల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు మనస్ఫర్థలు వచ్చాయని.. ఈ మూవీ ఆల్బమ్‌పై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురం’లో చిత్రం కూడా మహేష్ మూవీతో పోటీ పడనుండగా.. ఇప్పటికే వారు ప్రమోషన్లలో దూసుకుపోతూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇలాంటి సమయంలో సరిలేరు నీకెవ్వరు టీమ్ సైలెంట్‌గా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు లోనయ్యారు. ఇక వారందరినీ కూల్‌ చేయడం కోసం ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర రంగంలోకి దిగారు.
‘‘సరిలేరు నీకెవ్వరు కోసం దేవీ శ్రీ ప్రసాద్ చేసిన మాస్ సాంగ్‌ను విన్నాను. ఆ పాటకు కేక అనేది చిన్న పదం అవుతుంది. దేవీ తన ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాడు. మహేష్ అభిమానులకు, ప్రేక్షకులకు ఈ పాట మాస్ ట్రీట్‌ను ఇవ్వబోతోంది. రాక్‌స్టార్, అనిల్ రావిపూడికి చాలా థ్యాంక్స్. అభిమానులకు ఈ ఆల్బమ్ కచ్చితంగా నచ్చుతుంది’’ అని అనిల్ సుంకర ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా సినిమా ప్రారంభోత్సవంలో దేవీ మాట్లాడిన వీడియోను.. అతడితో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు.
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Embedded video

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...