Skip to main content

ఏ రాష్ట్రమూ ఇంత దగా పడలేదు: జగన్‌

 

ఏ రాష్ట్రమూ ఇంత దగా పడలేదు: జగన్‌
 ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని సీఎం జగన్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్‌ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని జగన్‌ పిలుపునిచ్చారు. 
ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం నాకు గర్వకారణం
గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్ప నేల ఆంధ్రప్రదేశ్‌ అని.. స్వాతంత్ర్యోద్యమంలో ఈ రాష్ట్రానిది కీలక పాత్ర అంటూ కొనియాడారు. ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నమయ్యారని చెప్పారు. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారని గవర్నర్‌ గుర్తు చేశారు. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి గర్వకారణంగా నిలిచారని బిశ్వభూషణ్‌ కొనియాడారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...