Skip to main content

అజిత్‌పవార్‌ది వెన్నుపోటు:సంజయ్‌ రౌత్‌



మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘నిన్న రాత్రి 9గంటల వరకు ఆ మహాశయుడు(అజిత్‌ పవార్‌) మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో అలాగే మాట్లాడారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే టచ్‌లోనే ఉన్నారు. ఈరోజు కూడా వారు భేటీ అవుతారు. ఇద్దరూ కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అజిత్‌ పవార్‌, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారు’’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై సంజయ్‌ రౌత్‌ ఈరోజు ఉదయం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 

మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని అనుకుంటున్న వేళ.. భాజపాతో కలిసి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.