Skip to main content

అజిత్‌పవార్‌ది వెన్నుపోటు:సంజయ్‌ రౌత్‌



మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘నిన్న రాత్రి 9గంటల వరకు ఆ మహాశయుడు(అజిత్‌ పవార్‌) మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో అలాగే మాట్లాడారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే టచ్‌లోనే ఉన్నారు. ఈరోజు కూడా వారు భేటీ అవుతారు. ఇద్దరూ కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అజిత్‌ పవార్‌, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారు’’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై సంజయ్‌ రౌత్‌ ఈరోజు ఉదయం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 

మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని అనుకుంటున్న వేళ.. భాజపాతో కలిసి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...