Skip to main content

అజిత్‌పవార్‌ది వెన్నుపోటు:సంజయ్‌ రౌత్‌



మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘నిన్న రాత్రి 9గంటల వరకు ఆ మహాశయుడు(అజిత్‌ పవార్‌) మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కళ్లలోకి కళ్లు పెట్టి చూడడానికి కూడా ఇష్టపడ లేదు. తప్పు చేసిన వాళ్లు ఎలా కిందికి తలదించుకొని మాట్లాడతారో అలాగే మాట్లాడారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే టచ్‌లోనే ఉన్నారు. ఈరోజు కూడా వారు భేటీ అవుతారు. ఇద్దరూ కలిసే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అజిత్‌ పవార్‌, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారు’’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై సంజయ్‌ రౌత్‌ ఈరోజు ఉదయం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 

మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని అనుకుంటున్న వేళ.. భాజపాతో కలిసి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...