Skip to main content

అమెరికాలో తెలుగు టెకీ మృతి

 
అమెరికాలో తెలుగు టెకీ మృతి
 ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరు అమెరికాలో అకాల మరణం చెందారు. గ్రీన్‌ కార్డ్‌ బ్యాక్‌లాగ్‌ లిస్ట్‌లో ఉన్న అతడి మృతితో గర్భిణి అయిన ఆయన భార్య అర్ధంతరంగా స్వదేశానికి తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది. నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతి రాజు మంగళవారం మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏ కారణంతో చనిపోయారన్న వివరాలు తెలియరాలేదు. ఆయన ఫేస్‌బుక్‌ వివరాలను బట్టి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వీరి దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ జాబితాలో ఉంది. రాజు అకాల మరణంతో ఆయన భార్య గర్భిణి అయిన సౌజన్య తిరుగు ప్రయాణం అయ్యారు. 
రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాజు కొన్నేళ్లుగా నార్త్‌ కరోలినాలో ఉంటున్నారు. పలు కంపెనీల్లో పనిచేశారు. ఆయన మృతిపట్ల అమెరికాలో తెలుగు సంఘాలు స్పందించాయి. రాజు మృతదేహాన్ని స్వదేశం తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చేందుకు పీడిమాంట్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ (పాటా) ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. మరోవైపు ఏళ్లుగా గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న అక్కడి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...