Skip to main content

సేనకు సీఎం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ! ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన ప్రయత్నాలు

 
సేనకు సీఎం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ!
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తెలిపేందుకు శివసేనకు సమయం దగ్గరపడుతోంది. సర్కారు కొలువుతీరాలంటే సేనకు కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్‌తో చర్చల తర్వాతే తమ వైఖరి తెలియజేస్తామని చెబుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్సీపీతో శివసేన బేరసారాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రెండు పార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే ఎన్పీసీ, కాంగ్రెస్‌లకు చెరొకటి చొప్పున రెండు డిప్యూటీ సీఎం పదవులిస్తామని శివసేన ఆఫర్‌ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవికి కూడా సేన నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ఏర్పడిన తర్వాత మిత్రపక్షాల మద్దతుతోనే సీఎం ఎన్నిక ఉంటుందని శివసేన వర్గాలు చెబుతున్నాయి. 
గవర్నర్‌ను కలవనున్న ఏక్‌నాథ్‌
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరి తెలియజేసేందుకు శివసేన శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్‌ షిండే ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. అటు తాజా పరిణామాలపై చర్చించేందుకు పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో సంజయ్‌ రౌత్‌ సమావేశమయ్యారు. 
సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ భేటీ
మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ ఈ ఉదయం అయ్యింది. శివసేనతో పొత్తు పెట్టుకుంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి పార్టీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం సేనతో చేతులు కలపాలని 85శాతం మంది మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
సమావేశమైన భాజపా కోర్‌ కమిటీ
అటు తాజా పరిణామాలపై భాజపా కోర్‌ కమిటీ కూడా భేటీ అయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసంలో భాజపా నేతలు సమావేశమయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు కూడా భేటీ అయ్యారు. 

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.