Skip to main content

కేరళకు మహేశ్ బాబు అండ్ టీమ్


మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం చకచకా జరిగిపోతోంది. రీసెంట్ గా ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేసినట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. ఆల్రెడీ ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరినట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.  విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.  

Comments

Popular posts from this blog

రష్యా టీకా సమర్థతపై సమాచారం లేదు: డబ్ల్యూహెచ్ఓ

  ఈ వారం ప్రారంభంలో రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు.  ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు.  

పోలవరం పూర్తి చేస్తే.. మీ పార్టీని మూసేస్తారా?

పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో సుమారు రూ. 780 కోట్లు ఆదా చేసి చరిత్ర సృష్టించామని  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వివరాలు కోసం క్లిక్ చేయండి