Skip to main content

గాంధీ పుట్టిన దేశంలో హింసకు చోటివ్వద్దు

 
గాంధీ పుట్టిన దేశంలో హింసకు చోటివ్వద్దు
 చారిత్రక అయోధ్య తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పిచ్చినా..మనం మాత్రం సంయమనం పాటించాలి. వేల ఏళ్ల నాటి భారత సంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనదే. సామాజిక సామరస్యాన్ని, పరస్పర ప్రేమను పంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. మహాత్మాగాంధీ పుట్టిన దేశమిది. హింసకు తావుండకూడదు. ఆయన కలలు కన్న దేశ శాంతిని కాపాడటం మన విధి’ అని ప్రియాంక ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.
అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీమసీదు కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని వాదనలు పూర్తవ్వగా.. తాజాగా సీజేఐ రంజన్‌ గొగొయితో కూడిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల్లో ముందస్తు చర్యగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల విషయంలోనూ ఆంక్షలు విధించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.