Skip to main content

డిస్నీ సినిమాలో మహేష్ గారాలపట్టి సితార…!


కొన్ని హాలీవుడ్ సినిమాలకు సౌత్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే డిస్నీ నుంచి వచ్చే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి. కాగా… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో ఓ ఛానల్ కూడా ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. అడ‌పాద‌డ‌పా ఆమెకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌డం, వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోవ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య సొంతంగా యూట్యూబ్ లో A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సితార హాలీవుడ్‌కు చెందిన డిస్నీ స్టూడియోతో పని చేసే అవకాశం వచ్చింది. డిస్నీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ఫ్రోజెన్ 2″లో ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేష్ ముద్దుల కూతురు సితార గాత్ర దానం చేసింది. దీనికి సంబందించిన అధికార ప్రకటన కూడ విడుదల చేసింది డిస్నీ. ఫ్రోజెన్ 2 సినిమాను డిస్నీ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషాల్లో విడుదల చేస్తోంది. హిందీలో చిన్ననాటి ఎల్సా పాత్రకు పరిణీతి డబ్బింగ్ చెప్పింది. ఎల్సా ప్రధాన పాత్రకు గ్లోబల్ స్టార్ ప్రియాంక గాత్ర దానం చేస్తోంది. తమిళ్‌లో ఈ పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగు‌లో మాత్రం నిత్యా మీనన్ చెబుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...