Skip to main content

సమ్మెపై మరోసారి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ




ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై జేఏసీ  మరోసారి వెనక్కి తగ్గింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీజేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు, ఆర్టీసీని బతికించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 52 రోజులపాటు కొనసాగిన పోరాటంలో ఎవరమూ ఓడిపోలేదన్నారు. తాము చేపట్టిన ఈ పోరాటం ఆర్టీసీని బతికించుకోవడానికి, కార్మికుల డిమాండ్లను నేరవేర్చుకోడానికి నాంది పలుకుతుందన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావద్దని ఆయన కోరారు. రేపు ఉదయం 6 గంటలకు కార్మికులందరూ విధులకు హాజరై యాజమన్యంపై ఒత్తిడి తేవాలని పిలుపు నిచ్చారు.  విధుల్లోకి చేరే కార్మికులను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన సూచించారు. సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తోందని ఆశించిన జేేఏసీ అటువంటి ప్రకటన రాకపోవడంతో.. విధుల్లో చేరాలని నిర్ణయించామని చెప్పారు. హైకోర్టు చేసిన సూచన ప్రకారం, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకోసమే సమ్మె విరమణ చేస్తున్నట్లు తెలిపారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.