Skip to main content

మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం


Our phones were snatched but stars took selfies, ‘ మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం
ప్రధాని మోదీ తీరు పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు, ‘ గాన గంధర్వ ‘ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని కలిసిన సందర్భంలో ఆయన, మరికొందరు తమపట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని బాలు తన ఫేస్ బుక్ లో మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. తమ సెల్ ఫోన్లన్నీ లాక్కున్నారని, వాటికి టోకెన్లు ఇచ్చారని, అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం ప్రధానితో సెల్ఫీలు దిగారని ఆయన అన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ ఈనాడు ‘ చీఫ్ రామోజీరావుకు నేనెంతో కృతజ్ఞుడిని.. ఆయన చేసిన ఏర్పాట్ల కారణంగా నేను గత నెల 29 న ఢిల్లీలో మోదీ నిర్వహించిన రిసెప్షన్ కి వెళ్లాను.. కానీ వెళ్ళగానే మా సెల్ ఫోన్లను వదిలేయాలని అక్కడి సెక్యూరిటీ కోరారు. వాటికి మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ అదే రోజున బాలీవుడ్ స్టార్స్ మోదీతో సెల్ఫీలు దిగడం చూసి ఆశ్చర్యం వేసింది ‘ అని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీయిజాన్ని ప్రమోట్ చేసేందుకు మోదీ గతవారం తన నివాసంలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ సహా బాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. కానీ దక్షిణాది నుంచి తెలుగు నిర్మాత దిల్ రాజు ఒక్కరే అక్కడ కనిపించారు. కాగా- మోదీ వ్యవహరించిన తీరు పట్ల పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా తన ట్విట్టర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి మన ప్రతినిధులెవరూ కనిపించకపోవడం పట్ల ఆమె సైతం కలత చెందారు.. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆమె మోదీని కోరారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...