Skip to main content

మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం


Our phones were snatched but stars took selfies, ‘ మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం
ప్రధాని మోదీ తీరు పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు, ‘ గాన గంధర్వ ‘ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని కలిసిన సందర్భంలో ఆయన, మరికొందరు తమపట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని బాలు తన ఫేస్ బుక్ లో మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. తమ సెల్ ఫోన్లన్నీ లాక్కున్నారని, వాటికి టోకెన్లు ఇచ్చారని, అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం ప్రధానితో సెల్ఫీలు దిగారని ఆయన అన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ ఈనాడు ‘ చీఫ్ రామోజీరావుకు నేనెంతో కృతజ్ఞుడిని.. ఆయన చేసిన ఏర్పాట్ల కారణంగా నేను గత నెల 29 న ఢిల్లీలో మోదీ నిర్వహించిన రిసెప్షన్ కి వెళ్లాను.. కానీ వెళ్ళగానే మా సెల్ ఫోన్లను వదిలేయాలని అక్కడి సెక్యూరిటీ కోరారు. వాటికి మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ అదే రోజున బాలీవుడ్ స్టార్స్ మోదీతో సెల్ఫీలు దిగడం చూసి ఆశ్చర్యం వేసింది ‘ అని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీయిజాన్ని ప్రమోట్ చేసేందుకు మోదీ గతవారం తన నివాసంలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ సహా బాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. కానీ దక్షిణాది నుంచి తెలుగు నిర్మాత దిల్ రాజు ఒక్కరే అక్కడ కనిపించారు. కాగా- మోదీ వ్యవహరించిన తీరు పట్ల పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా తన ట్విట్టర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి మన ప్రతినిధులెవరూ కనిపించకపోవడం పట్ల ఆమె సైతం కలత చెందారు.. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆమె మోదీని కోరారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.