Skip to main content

చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డ లక్ష్మీ పార్వతి

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ విభజనకు తీర్మానం చేశారని చంద్రబాబును ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్రంగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయండని కోరుతూ కేంద్రానికి లేఖను పంపించారని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు తెచ్చుకోలేదని ఆమె ప్రశ్నించారు.

అదేవిధంగా తెలుగు అకాడమీని ఇక్కడకు ఎందుకు తీసుకురాలేదన్నారు. తెలుగు భాషకు సంబంధించి మీరు చేసిందేమిటి? ఎటువంటి పోస్టులు సృష్టించారు? అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఈ దిశలో అడుగులు వేస్తోందన్నారు. తెలుగు అకాడమీని విభజించుకునే ప్రక్రియలో భాగంగా తనను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా వేయడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములను స్మరించుకునే దినాన్ని కూడా మీరు తుంగలో తొక్కారని టీడీపీ అధినేతను విమర్శించారు. మీకు తెలుగు భాష గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.