Skip to main content

పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ లో చంద్రబాబుతో బీజేపీ వేదికను పంచుకోదు: విష్ణువర్ధన్ రెడ్డి

 


ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడేందుకు ఈ నెల 3న జనసేన లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మార్చ్ లో విపక్షాలన్నీ పాల్గొనాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. మరోవైపు, ఈ మార్చ్ లో తాము పాల్గొనబోమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

విశాఖలో జరిగే పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి బీజేపీ వేదికను పంచుకోదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో ఇసుకను, ఇతర వనరులను ఆ పార్టీ నేతలు దోచేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆందోళనలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. టీడీపీని జనసేన దూరం పెడితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు.

చంద్రబాబును రాష్ట్రంలో ఏ పార్టీ నమ్మడం లేదని... అందుకే పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విష్ణు మండిపడ్డారు. బీజేపీని చంద్రబాబు ఒకటి, రెండు సార్లు మోసం చేయొచ్చు కాన్నీ ప్రతిసారీ మోసం చేయలేరని అన్నారు. జనసేన ఆందోళన వెనుక చంద్రబాబు అనైతిక రాజకీయ ముసుగు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇసుక సమస్యపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అందుకే ఇసుక సమస్యకు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుందే తప్ప, నాయకుల పక్షాన కాదని తెలిపారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...