Skip to main content

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం హర్షణీయం: తులసిరెడ్డి



ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని ప్రాంతాల్లో నిర్మాణాలను ఆపకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఇది రాజధాని కోసం భూములిచ్చిన రైతుల, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల, మీడియా విజయమని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో అమరావతిపై భయాందోళనలు నెలకొన్న మాట వాస్తవమని అన్నారు.

దీనికి తోడు అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకోవడం, దానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టతను ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజధాని పనులపై జగన్ సమీక్ష నిర్వహించడం, ఇప్పటికే చేపట్టిన పనులను కొనసాగించాలని నిర్ణయించడం హర్షణీయమని తెలిపారు.

ఏపీకి రాజధాని, హైకోర్టు రెండు కళ్లవంటివని తులసిరెడ్డి చెప్పారు. వీటిలో ఒకదాన్ని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే, మరొకదాన్ని రాయసీమలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని శ్రీబాగ్ ఒప్పందం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. రాజధానిని కోస్తాలో కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం సమంజసమని చెప్పారు.

గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. హైకోర్టును రాయలసీమలో, హైకోర్టు బెంచ్ లను అమరావతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయడం మంచిదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ వాసులై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.