Skip to main content

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం హర్షణీయం: తులసిరెడ్డి



ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని ప్రాంతాల్లో నిర్మాణాలను ఆపకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఇది రాజధాని కోసం భూములిచ్చిన రైతుల, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల, మీడియా విజయమని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో అమరావతిపై భయాందోళనలు నెలకొన్న మాట వాస్తవమని అన్నారు.

దీనికి తోడు అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకోవడం, దానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టతను ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజధాని పనులపై జగన్ సమీక్ష నిర్వహించడం, ఇప్పటికే చేపట్టిన పనులను కొనసాగించాలని నిర్ణయించడం హర్షణీయమని తెలిపారు.

ఏపీకి రాజధాని, హైకోర్టు రెండు కళ్లవంటివని తులసిరెడ్డి చెప్పారు. వీటిలో ఒకదాన్ని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే, మరొకదాన్ని రాయసీమలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని శ్రీబాగ్ ఒప్పందం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. రాజధానిని కోస్తాలో కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం సమంజసమని చెప్పారు.

గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. హైకోర్టును రాయలసీమలో, హైకోర్టు బెంచ్ లను అమరావతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయడం మంచిదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ వాసులై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...