Skip to main content

జగన్ పై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.. ఆయన నేరస్తుడు కాదు: సి.రామచంద్రయ్య


ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక నేరస్తుడు కాదని వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని... అనేక కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే బాధ కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేయాలనుకుంటున్న కార్యక్రమాలను జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తిన వేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని చిల్లర పార్టీలు మాత్రమే చంద్రబాబుకు మద్దతిస్తున్నాయని అన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...