Skip to main content

నందమూరి వారసుడు ఎంట్రీ ఎప్పుడు?



నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో మోక్షజ్ఞ, అదిగో మోక్షజ్ఞ అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తూనే ఉన్నారు. బాలయ్య నూరో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకో సినిమా కోసం కూడా అదే ప్రచారం కంటిన్యూ అయ్యింది. బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం షురూ కావడం లేదు. అసలింతకీ మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? లేదా? అనే ఆలోచనకి అభిమానులు వచ్చేశారు.
అసలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదనీ, కావాలని బలవంతం చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. మరి ఈ గుసగుసలకు చెక్‌ పెట్టాలన్నీ, రూమర్స్‌కి సడెన్‌ బ్రేక్‌ ఇవ్వాలన్నా ఒక్కటే మార్గం, మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కావడమే. కానీ ఎప్పుడు.? అందుకు సమయమొచ్చిందంటున్నారిప్పుడు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్‌.రామారావు దర్శకత్వంలో 'రూలర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుతో ఓ సినిమాలో నటించనున్నాడు.

ఆ సినిమాతో పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం. ఇదో పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శీను ఈ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడట. 'వీవీఆర్‌' తర్వాత బోయపాటి నుండి రానున్న సినిమా ఇది. రేపో మాపో సెట్స్‌ మీదికి వెళ్లనుంది. చూడాలి మరి, ఈ సారైనా నందమూరి వారసుడి ఎంట్రీ ఉంటుందో.? లేక ఎప్పటిలానే ఊరించి ఉసూరుమనిపిస్తారో.!

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...