Skip to main content

నందమూరి వారసుడు ఎంట్రీ ఎప్పుడు?



నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో మోక్షజ్ఞ, అదిగో మోక్షజ్ఞ అంటూ ఫ్యాన్స్‌ని ఊరిస్తూనే ఉన్నారు. బాలయ్య నూరో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకో సినిమా కోసం కూడా అదే ప్రచారం కంటిన్యూ అయ్యింది. బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం షురూ కావడం లేదు. అసలింతకీ మోక్షజ్ఞకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? లేదా? అనే ఆలోచనకి అభిమానులు వచ్చేశారు.
అసలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదనీ, కావాలని బలవంతం చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. మరి ఈ గుసగుసలకు చెక్‌ పెట్టాలన్నీ, రూమర్స్‌కి సడెన్‌ బ్రేక్‌ ఇవ్వాలన్నా ఒక్కటే మార్గం, మోక్షజ్ఞ ఎంట్రీ షురూ కావడమే. కానీ ఎప్పుడు.? అందుకు సమయమొచ్చిందంటున్నారిప్పుడు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్‌.రామారావు దర్శకత్వంలో 'రూలర్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుతో ఓ సినిమాలో నటించనున్నాడు.

ఆ సినిమాతో పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం. ఇదో పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శీను ఈ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడట. 'వీవీఆర్‌' తర్వాత బోయపాటి నుండి రానున్న సినిమా ఇది. రేపో మాపో సెట్స్‌ మీదికి వెళ్లనుంది. చూడాలి మరి, ఈ సారైనా నందమూరి వారసుడి ఎంట్రీ ఉంటుందో.? లేక ఎప్పటిలానే ఊరించి ఉసూరుమనిపిస్తారో.!

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...