Skip to main content

కొనసాగుతున్న టీఎస్ ఆర్టీసీ సమ్మె... కార్మికులను విధుల్లోకి పిలిచేందుకు కేసీఆర్ సర్కారు ససేమిరా!



 నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉండదని భావించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. నిన్న సమావేశమైన ఉద్యోగ సంఘాలు, అక్టోబర్ 4కు ముందున్న పరిస్థితిని కల్పిస్తే, విధుల్లోకి వస్తామని, విధుల్లోకి వచ్చే వారికి ఏ విధమైన షరతులు పెట్టరాదని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ విషయంలో కేసీఆర్ సర్కారు మాత్రం ఇంకా బెట్టు వీడలేదు. ఆర్టీసీ కార్మికుల కేసు లేబర్ కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో షరతులు పెట్టరాదన్న కార్మిక సంఘాల డిమాండ్ కు కూడా అంగీకరించరాదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

విధుల్లో చేరే వారు నిర్దిష్ట కాల పరిమితి వరకూ మరోమారు సమ్మెకు దిగకుండా బాండ్ రాసివ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఇకపై ఎన్నడూ ప్రస్తావించరాదని ప్రభుత్వం షరతులు విధించనున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. అయితే, ప్రభుత్వం విధించాలనుకుంటున్న షరతులపై కార్మిక సంఘాల నేతలకు సమాచారం త్వరలోనే వెళుతుందని తెలుస్తోంది.

ప్రభుత్వం పెట్టే కొన్ని షరతులకు ఉద్యోగులు అంగీకరిస్తే, విధుల్లోకి రావచ్చని, అసలు ఈ సమ్మె చట్ట విరుద్ధమైనది కావడంతో, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా, ప్రజలకు మరోసారి సమస్య రాకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు.


Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.