Skip to main content

కొనసాగుతున్న టీఎస్ ఆర్టీసీ సమ్మె... కార్మికులను విధుల్లోకి పిలిచేందుకు కేసీఆర్ సర్కారు ససేమిరా!



 నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉండదని భావించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. నిన్న సమావేశమైన ఉద్యోగ సంఘాలు, అక్టోబర్ 4కు ముందున్న పరిస్థితిని కల్పిస్తే, విధుల్లోకి వస్తామని, విధుల్లోకి వచ్చే వారికి ఏ విధమైన షరతులు పెట్టరాదని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ విషయంలో కేసీఆర్ సర్కారు మాత్రం ఇంకా బెట్టు వీడలేదు. ఆర్టీసీ కార్మికుల కేసు లేబర్ కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో షరతులు పెట్టరాదన్న కార్మిక సంఘాల డిమాండ్ కు కూడా అంగీకరించరాదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

విధుల్లో చేరే వారు నిర్దిష్ట కాల పరిమితి వరకూ మరోమారు సమ్మెకు దిగకుండా బాండ్ రాసివ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఇకపై ఎన్నడూ ప్రస్తావించరాదని ప్రభుత్వం షరతులు విధించనున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. అయితే, ప్రభుత్వం విధించాలనుకుంటున్న షరతులపై కార్మిక సంఘాల నేతలకు సమాచారం త్వరలోనే వెళుతుందని తెలుస్తోంది.

ప్రభుత్వం పెట్టే కొన్ని షరతులకు ఉద్యోగులు అంగీకరిస్తే, విధుల్లోకి రావచ్చని, అసలు ఈ సమ్మె చట్ట విరుద్ధమైనది కావడంతో, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా, ప్రజలకు మరోసారి సమస్య రాకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు.


Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.