Skip to main content

కొనసాగుతున్న టీఎస్ ఆర్టీసీ సమ్మె... కార్మికులను విధుల్లోకి పిలిచేందుకు కేసీఆర్ సర్కారు ససేమిరా!



 నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉండదని భావించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. నిన్న సమావేశమైన ఉద్యోగ సంఘాలు, అక్టోబర్ 4కు ముందున్న పరిస్థితిని కల్పిస్తే, విధుల్లోకి వస్తామని, విధుల్లోకి వచ్చే వారికి ఏ విధమైన షరతులు పెట్టరాదని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ విషయంలో కేసీఆర్ సర్కారు మాత్రం ఇంకా బెట్టు వీడలేదు. ఆర్టీసీ కార్మికుల కేసు లేబర్ కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చేంత వరకూ వేచి చూడాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో షరతులు పెట్టరాదన్న కార్మిక సంఘాల డిమాండ్ కు కూడా అంగీకరించరాదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

విధుల్లో చేరే వారు నిర్దిష్ట కాల పరిమితి వరకూ మరోమారు సమ్మెకు దిగకుండా బాండ్ రాసివ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఇకపై ఎన్నడూ ప్రస్తావించరాదని ప్రభుత్వం షరతులు విధించనున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. అయితే, ప్రభుత్వం విధించాలనుకుంటున్న షరతులపై కార్మిక సంఘాల నేతలకు సమాచారం త్వరలోనే వెళుతుందని తెలుస్తోంది.

ప్రభుత్వం పెట్టే కొన్ని షరతులకు ఉద్యోగులు అంగీకరిస్తే, విధుల్లోకి రావచ్చని, అసలు ఈ సమ్మె చట్ట విరుద్ధమైనది కావడంతో, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా, ప్రజలకు మరోసారి సమస్య రాకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు.


Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...