Skip to main content

కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం

.

CMs urge Centre to convene urgent meeting on Delhi Pollution, కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం..!

ఢిల్లీలో వాయు కాలుష్యం అతి పెద్ద సమస్యగా మారింది. దీపావళి పండుగ అనంతరం ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో జనం ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. అలాగే.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. యూపీ, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.
కాగా.. ప్రస్తుతం ఈ లేఖలపై పెద్ద దుమారమే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకే ఉమ్మడిగా కృషి చేయాలని ఢిల్లీ పరిసర రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా.. హర్యాణా, పంజాబ్‌ రాష్ట్రాల కారణంగా.. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని.. ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు.. విద్యార్థులచే లేఖలు రాయించారు సీఎం కేజ్రీవాల్. దీనికి స్పందించిన కేంద్రమంత్రి జవదేకర్.. ఈ విషయాన్ని కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఢిల్లీ రాజధాని.. అతి ముఖ్యమైన సమస్య.. కాలుష్యమని.. దీనిపై కేంద్రమంత్రి సరిగా.. స్పందిచకపోగా.. రాజకీయాలు చేయొద్దని.. వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని.. ఢిల్లీలో.. గాలి నాణ్యత క్షీణిస్తున్నప్పటికీ కేంద్రమంత్రి పట్టించుకోడం లేదని విమర్శించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...