Skip to main content

కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం

.

CMs urge Centre to convene urgent meeting on Delhi Pollution, కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల మధ్య ముదిరిన వాగ్వాదం..!

ఢిల్లీలో వాయు కాలుష్యం అతి పెద్ద సమస్యగా మారింది. దీపావళి పండుగ అనంతరం ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో జనం ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. అలాగే.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. యూపీ, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.
కాగా.. ప్రస్తుతం ఈ లేఖలపై పెద్ద దుమారమే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకే ఉమ్మడిగా కృషి చేయాలని ఢిల్లీ పరిసర రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ద్వారా.. హర్యాణా, పంజాబ్‌ రాష్ట్రాల కారణంగా.. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని.. ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు.. విద్యార్థులచే లేఖలు రాయించారు సీఎం కేజ్రీవాల్. దీనికి స్పందించిన కేంద్రమంత్రి జవదేకర్.. ఈ విషయాన్ని కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఢిల్లీ రాజధాని.. అతి ముఖ్యమైన సమస్య.. కాలుష్యమని.. దీనిపై కేంద్రమంత్రి సరిగా.. స్పందిచకపోగా.. రాజకీయాలు చేయొద్దని.. వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని.. ఢిల్లీలో.. గాలి నాణ్యత క్షీణిస్తున్నప్పటికీ కేంద్రమంత్రి పట్టించుకోడం లేదని విమర్శించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...