Skip to main content

పవన్ కల్యాణ్ 'లాంగ్ మార్చ్' పై మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు


రాష్ట్రంలో ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించ తలపెట్టిన 'లాంగ్ మార్చ్' కార్యక్రమంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ నిర్వహిస్తోంది 'లాంగ్ మార్చ్' కాదని 'రాంగ్ మార్చ్' అని సెటైర్ వేశారు. చంద్రబాబు పిలుపు ఇవ్వగానే జనసేన ఆందోళనకు దిగడం ఏంటన్న అనిల్ కుమార్, జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ పార్టీగా నడుస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని విమర్శించారు. ఏర్పేడు ఘటన బాధితులను పవన్ ఎందుకు పరామర్శించలేదో చెప్పాలని ప్రశ్నించారు.

విశాఖలో రేపు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో భారీగా భవన నిర్మాణ రంగ కార్మికులతో జనసేన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ 'లాంగ్ మార్చ్' కు తాజాగా ఏపీ పోలీసుల నుంచి అనుమతి కూడా మంజూరైంది.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.