Skip to main content

మరో ట్విస్ట్.. అజిత్ పవార్ కు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఆఫర్ చేసిన శివసేన?



మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతివ్వడంతో... ఫడ్నవిస్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పరిణామంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు షాక్ కు గురయ్యాయి. మరోవైపు, ఎలాగైనా అధికారాన్ని చేపట్టేందుకు శివసేన కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో అజిత్ పవార్ ను ఆకర్షించేందుకు శివసేన యత్నిస్తోంది. తమకు మద్దతు పలికితే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని అజిత్ పవార్ కు శివసేన ఆఫర్ చేసినట్టు ముంబై పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే బీజేపీతో చేయి కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...