Skip to main content

రజనీకాంత్ కు విశిష్ట పురస్కారం... ప్రకాశ్ జవదేకర్ ప్రకటన

 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్ఫి)లో ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయం తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగానికి రజనీకాంత్ అందించిన సేవలు అద్భుతమని జవదేకర్ ఓ ప్రకటనలో కొనియాడారు. అందుకే ఈ ఏడాది ఇఫ్ఫి-2019 ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును రజనీకాంత్ కు ప్రదానం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

50వ ఇఫ్ఫి అవార్డుల ఉత్సవం గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన సుమారు 250 సినిమాలను ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఇక, విదేశీ ఆర్టిస్ట్ కేటగిరీలో  ఇఫ్ఫి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఈ ఏడాది ఫ్రెంచ్ నటీమణి ఇసబెల్లా హూపర్ట్ కు ప్రదానం చేస్తున్నట్టు జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా, ఇఫ్ఫి-2019 చలనచిత్రోత్సవాలను భారత్ తన చిరకాల మిత్రదేశం రష్యా భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.