ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేందుకు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చాక మాటమారుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలో మాజీ మంత్రి ఎమ్ ఎస్ ఎస్ కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరయిన లోకేశ్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధానికోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం వంచించిదని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలను సీఎం జగన్ పొమ్మంటే, తెలంగాణ రమ్మంటుందని విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment