Skip to main content

శివసేన నేతే మహారాష్ట్ర సీఎం: సంజయ్ రౌత్

 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీ మధ్య ప్రస్తుతం చర్చలు జరగడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేనకు చెందిన నేతే మహారాష్ట్రకు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. తన పట్టు వీడడం లేదన్న విషయం తెలిసిందే. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోంది.

ఈ రోజు సంయజ్ రౌత్ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటమూ జారీ చేయాలని అనుకోవట్లేదు. ఆ పార్టీ వారు గొప్ప నేతలు. ఒకవేళ శివసేన ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే స్థిరమైన సర్కారు ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో 50-50 ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. అలాగే, వారు శివసేన నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు.  మేము రైతుల కష్టాలను వివరించి చెప్పేందుకే గవర్నర్ ను కలుస్తున్నాం. ఇందులో మరే ఉద్దేశం లేదు' అని వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.