Skip to main content

నా 50ఏళ్ల రాజకీయంలో ఇలాంటివెన్నో చూశా!



శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీల కూటమే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కరాడ్‌లో మీడియాతో మాట్లాడారు. భాజపాతో చేతులు కలిపింది తన సోదరుడి కుమారుడు అజిత్‌ పవారే తప్ప ఎన్సీపీ కాదని పునరుద్ఘాటించారు. ఇది ఎంతమాత్రం  తమ పార్టీ నిర్ణయం కాదనీ..  ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని తాము అంగీకరించబోమని పవార్‌ స్పష్టంచేశారు. ఎన్సీపీ- కాంగ్రెస్‌- శివసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తమ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌తో తాను టచ్‌లో లేనన్నారు. అజిత్‌ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించే అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం అనూహ్యంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శరద్‌ పవార్‌ కరాడ్‌కు వెళ్లారు. ఆయన స్మారకం ‘ప్రీతి సంగమ్‌’ వద్ద పవార్‌ నివాళులర్పించారు.  మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశాను. క్లిష్ట పరిస్థితులు వస్తాయి.. కానీ అవన్నీ తాత్కాలికమే. రాష్ట్ర ప్రజలు బలంగా నిలబడతారనేది నా అనుభవం’’ అని చెప్పారు. రాష్ట్రంలో తనకు యువకుల సహకారం ఉందని.. ఏదో జరిగిపోతుందన్న ఆందోళన తనకు లేదని పవార్‌ అన్నారు. పవార్‌ వెంట సతారా ఎంపీ శ్రీనివాస్‌ పాటిల్ తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...