విజయవాడలోని ప్రఖ్యాత స్టెల్లా మేరీ కాలేజీలో ఈ ఉదయం ఒకేసారి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వీరంతా హాస్టల్ లో ఉన్నవారేనని తెలుస్తుండటంతో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి, చికిత్స చేయిస్తున్నారు. జరిగిన ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం, ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తలను కొట్టి పారేసింది. వారంతా వైరల్ ఫీవర్ కు గురయ్యారని వివరణ ఇచ్చింది. అయితే, ఒకేసారి 30 మందికి వైరల్ ఫీవర్ ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు మాత్రం యాజమాన్యం సమాధానం ఇవ్వలేదు. ఇక ఆసుపత్రుల్లో చేరిన వారిని పరామర్శించేందుకు వారివారి బంధుమిత్రులు తరలిరావడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment