Skip to main content

ఓ బాలుడి కోసం 2100 స్పోర్ట్స్ కార్లు, 70 బైకులు తరలివచ్చాయి... అసలు కారణం ఇదే!


అమెరికాలోని మిస్సౌరీలో ఒక్కసారిగా వేల సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు వరుసగా కొలువుదీరాయి. దీనంతటికీ కారణం తెలుసుకోవాలంటే అలెక్ ఇంగ్రామ్ అనే 14 ఏళ్ల బాలుడి కథ తెలుసుకోవాలి. అలెక్ ఇంగ్రామ్ నవంబరు 7న కన్నుమూశాడు. ఆస్టియోసర్కోమా అనే అరుదైన బోన్ క్యాన్సర్ అలెక్ ను కబళించింది. నాలుగేళ్లకు పైగా క్యాన్సర్ తో పోరాడిన ఆ మిస్సౌరీ బాలుడు కొన్నిరోజుల క్రితమే ఈ లోకాన్ని వీడాడు. అలెక్ కు స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి. అందుకే తన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు, బైకులు పాల్గొనాలన్నది చివరికోరిక అని కుటుంబ సభ్యులకు తెలిపాడు.

ఈ విషయం తెలిసిన అమెరికా సమాజం కదిలిపోయింది. ముఖ్యంగా సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ ముందుకొచ్చి స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓ కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కార్లు వాషింగ్టన్ లోని మిస్సౌరీ చేరుకున్నాయి. మిస్సౌరీ నుంచి వాషింగ్టన్ లోని ఇమ్యూనల్ లూథరన్ చర్చ్ వరకు అలెక్ కడసారి యాత్రకు తోడుగా వచ్చేందుకు స్థానిక సిక్స్ ఫ్లాగ్స్ సెయింట్ లూయిస్ పార్కింట్ ఏరియా వద్ద కొలువుదీరాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.



Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...