Skip to main content

ఓ బాలుడి కోసం 2100 స్పోర్ట్స్ కార్లు, 70 బైకులు తరలివచ్చాయి... అసలు కారణం ఇదే!


అమెరికాలోని మిస్సౌరీలో ఒక్కసారిగా వేల సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు వరుసగా కొలువుదీరాయి. దీనంతటికీ కారణం తెలుసుకోవాలంటే అలెక్ ఇంగ్రామ్ అనే 14 ఏళ్ల బాలుడి కథ తెలుసుకోవాలి. అలెక్ ఇంగ్రామ్ నవంబరు 7న కన్నుమూశాడు. ఆస్టియోసర్కోమా అనే అరుదైన బోన్ క్యాన్సర్ అలెక్ ను కబళించింది. నాలుగేళ్లకు పైగా క్యాన్సర్ తో పోరాడిన ఆ మిస్సౌరీ బాలుడు కొన్నిరోజుల క్రితమే ఈ లోకాన్ని వీడాడు. అలెక్ కు స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి. అందుకే తన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు, బైకులు పాల్గొనాలన్నది చివరికోరిక అని కుటుంబ సభ్యులకు తెలిపాడు.

ఈ విషయం తెలిసిన అమెరికా సమాజం కదిలిపోయింది. ముఖ్యంగా సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ ముందుకొచ్చి స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓ కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కార్లు వాషింగ్టన్ లోని మిస్సౌరీ చేరుకున్నాయి. మిస్సౌరీ నుంచి వాషింగ్టన్ లోని ఇమ్యూనల్ లూథరన్ చర్చ్ వరకు అలెక్ కడసారి యాత్రకు తోడుగా వచ్చేందుకు స్థానిక సిక్స్ ఫ్లాగ్స్ సెయింట్ లూయిస్ పార్కింట్ ఏరియా వద్ద కొలువుదీరాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.



Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...