Skip to main content

సింగిల్స్ డే’ షాపింగ్ సందర్భంగా.. అలీబాబాలో ‘ఒక్క గంట'లో 12 బిలియన్ డాలర్ల అమ్మకాలు!

 గంటలోనే 12 బిలియన్ డాలర్ల( 84 బిలియన్ యువాన్లు) విలువైన అమ్మకాలు నమోదు చేసి, చైనా ఆన్ లైన్ విక్రయ సంస్థ అలీబాబా.కామ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సింగిల్స్ డే’ షాపింగ్ బొనాంజా ప్రకటించిన అలీబాబా హోల్డింగ్స్ కంపెనీ ఆన్ లైన్ అమ్మకాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.  

ఈ మేరకు వివరాలను కంపెనీ ఛైర్మన్ డేనియల్ జాంగ్ వెల్లడించారు. 2009 నుంచి ‘సింగిల్స్ డే’ నిర్వహిస్తుమన్నారు. ‘సింగిల్స్ డే’ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒంటరి వారు ఇందులో కొనుగోళ్లు చేస్తూ.. వాటిని తమకుతామే బహుమతి తీసుకుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతిపెద్ద ఆన్ లైన్ కొనుగోళ్ల ఈవెంట్ గా పేరు పొందింది. అమెరికాలో నిర్వహించే ఆన్ లైన్ షాపింగ్ ఉత్సవాలు అకిన్ టూ బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి కార్యక్రమాల రీతిలో చైనాలో కూడా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు తేదీ 11, నెల 11 కాబట్టి ఈ అమ్మకాలను డబుల్ ఎలెవన్ గా కూడా పిలుస్తున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.