Skip to main content

సింగిల్స్ డే’ షాపింగ్ సందర్భంగా.. అలీబాబాలో ‘ఒక్క గంట'లో 12 బిలియన్ డాలర్ల అమ్మకాలు!

 గంటలోనే 12 బిలియన్ డాలర్ల( 84 బిలియన్ యువాన్లు) విలువైన అమ్మకాలు నమోదు చేసి, చైనా ఆన్ లైన్ విక్రయ సంస్థ అలీబాబా.కామ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సింగిల్స్ డే’ షాపింగ్ బొనాంజా ప్రకటించిన అలీబాబా హోల్డింగ్స్ కంపెనీ ఆన్ లైన్ అమ్మకాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.  

ఈ మేరకు వివరాలను కంపెనీ ఛైర్మన్ డేనియల్ జాంగ్ వెల్లడించారు. 2009 నుంచి ‘సింగిల్స్ డే’ నిర్వహిస్తుమన్నారు. ‘సింగిల్స్ డే’ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒంటరి వారు ఇందులో కొనుగోళ్లు చేస్తూ.. వాటిని తమకుతామే బహుమతి తీసుకుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతిపెద్ద ఆన్ లైన్ కొనుగోళ్ల ఈవెంట్ గా పేరు పొందింది. అమెరికాలో నిర్వహించే ఆన్ లైన్ షాపింగ్ ఉత్సవాలు అకిన్ టూ బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి కార్యక్రమాల రీతిలో చైనాలో కూడా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు తేదీ 11, నెల 11 కాబట్టి ఈ అమ్మకాలను డబుల్ ఎలెవన్ గా కూడా పిలుస్తున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...