Skip to main content

సింగిల్స్ డే’ షాపింగ్ సందర్భంగా.. అలీబాబాలో ‘ఒక్క గంట'లో 12 బిలియన్ డాలర్ల అమ్మకాలు!

 గంటలోనే 12 బిలియన్ డాలర్ల( 84 బిలియన్ యువాన్లు) విలువైన అమ్మకాలు నమోదు చేసి, చైనా ఆన్ లైన్ విక్రయ సంస్థ అలీబాబా.కామ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సింగిల్స్ డే’ షాపింగ్ బొనాంజా ప్రకటించిన అలీబాబా హోల్డింగ్స్ కంపెనీ ఆన్ లైన్ అమ్మకాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.  

ఈ మేరకు వివరాలను కంపెనీ ఛైర్మన్ డేనియల్ జాంగ్ వెల్లడించారు. 2009 నుంచి ‘సింగిల్స్ డే’ నిర్వహిస్తుమన్నారు. ‘సింగిల్స్ డే’ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒంటరి వారు ఇందులో కొనుగోళ్లు చేస్తూ.. వాటిని తమకుతామే బహుమతి తీసుకుంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతిపెద్ద ఆన్ లైన్ కొనుగోళ్ల ఈవెంట్ గా పేరు పొందింది. అమెరికాలో నిర్వహించే ఆన్ లైన్ షాపింగ్ ఉత్సవాలు అకిన్ టూ బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వంటి కార్యక్రమాల రీతిలో చైనాలో కూడా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు తేదీ 11, నెల 11 కాబట్టి ఈ అమ్మకాలను డబుల్ ఎలెవన్ గా కూడా పిలుస్తున్నారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.