Skip to main content

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి:అనిల్‌

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి:అనిల్‌
 ఇదివరకు ప్రకటించినట్లే పోలవరం పనులను నవంబర్ 1న ప్రారంభించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరంపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. 2021 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేస్తామన్నారు. వరద జలాలతో రాయలసీమలో 86 శాతం ప్రాజెక్టులు నిండాయని తెలిపారు. తెదేపా హయాంలో పెండింగ్ పనులు పూర్తి చేయక పోవడం వల్లే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నింపలేకపోయామని మంత్రి ఆరోపించారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఉన్న అన్ని ప్రతిపాదనలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. తెలంగాణ భూభాగం నుంచి నీటిని తీసుకునే ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.