Skip to main content

వంశీని బీజేపీలో చేరకుండా టీడీపీ, వైసీపీ అడ్డుకుంటున్నాయి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

 

ఏపీలో వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్టు లేదు. టీడీపీకి గుడ్ బై చెప్పిన ఈ గన్నవరం ఎమ్మెల్యే ఇంకా ఏ పార్టీలో చేరకపోవడంతో, ఆయన పయనం ఎటువైపన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ప్రజాదరణ ఉన్న కీలక నేత వంశీని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జాతీయస్థాయిలోకి రావాల్సిందిగా ఆయనను కోరుతున్నామని అన్నారు. అయితే వంశీని బీజేపీలో చేరకుండా టీడీపీ, వైసీపీ అడ్డుకుంటున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ కారణంగానే వంశీని టీడీపీని వీడారని ఆయన వెల్లడించారు. ఇంకా చాలామంది నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలిపారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.